Monday 26 August 2013

ఘాటెక్కిన ఉల్లి

  • 31/07/2013
షాద్‌నగర్ , జూలై 30: ఉల్లిధర ఒక్కసారిగా ఘాటెక్కడం.. పచ్చిమిర్చి
 కొండెక్కడంతో వినియోగ దారులు అయోమయానికి గురవుతున్నారు.
ఏ శుభకార్యక్రమంలో వంటలు మొదలు పెట్టాలంటే ముందుగా ఉల్లి,
 పచ్చిమిర్చి గుర్తుకు వస్తాయి. ఐతే వీటికి ఒక్కసారిగా ధరలు
పెరిగిపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
 జూలై మొదటి వారంలో ఉల్లికి 20 రూపాయల నుండి 24రూపాయలు
 వరకు ఉండేది, రెండవ వారంలో 25 రూపాయల నుండి 30 రూపాయల
 వరకు ఉండేది, మూడవ వారంలో 32 రూపాయల నుండి 40
రూపాయలకు పెరగడంతో ఏమి చేయాలో తెలియక వినియోగదారులు
 అనేక ఇబ్బందులు పడుతున్నారు. అదే విధంగా పచ్చిమిర్చి జూలై
మొదటి వారంలో 45 రూపాయల నుండి 50 రూపాయలు ఉండగా జూలై
 చివరి వారం వచ్చే సరికి ఒక్కసారిగా కిలో పచ్చిమిర్చికి 60 రూపాయలు
 పెరగడంతో ఏమి చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఉల్లి,
పచ్చిమిర్చితో పాటు టమాట, దొండ, కాకర, బీర, చిక్కుడు, క్యారెట్, బిన్నీస్
 వంటి కూరగాయల ధరలు కూడా మోతాదులో పెరిగిపోయాయి. దీంతో
కూరగాయలను ఎలా కొనుగోలు చేయాలంటూ లబ్ధిదారులు అయో మయానికి
 గురవుతున్నారు. పెరిగిన కూరగాయల ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం
 తగిన చర్యలు తీసుకో వాలంటూ లబ్ధిదారులు కోరు తున్నారు.

No comments:

Post a Comment